మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న అలవెన్సులు విడుదల చేయాలని డిమాండ్
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా టిబి (క్షయవ్యాధి) ఉద్యోగులు ఈరోజు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
క్షయవ్యాధి విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు POL (Petrol, Oil & Lubricants), వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చులు, FTA (Field Travel Allowance) అలవెన్సులు గత మూడు సంవత్సరాలుగా బకాయిలుగా పెండింగ్లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

