Advertising Banner

Veda Software Banner

Top Banner

LATEST UPDATES

Sunday, June 28, 2026

నిండు జీవితానికి రెండు చుక్కలు

June 28, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

నిండు జీవితానికి రెండు చుక్కలు

కేవలం రెండు చుక్కలు జీవితాంతం పోలియో నుంచి రక్షణ

- డాక్టర్ చేవూరు చిన్న 

కావలి,(ఆరోగ్యజ్యోతి):పోలియో రహిత దేశంగా భారతదేశాన్ని కొనసాగించడానికి భవిష్యత్తులో వైకల్యం రాకుండా నివారించడానికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి రెండు చుక్కల ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయించాలని ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని ది పూర్ పీపుల్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ చేవూరు చిన్న అన్నారు. ఆదివారం దళితవాడ అంగన్‌వాడీ కేంద్రం బూత్‌ ల ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా డాక్టర్ చేవూరు చిన్న మాట్లాడుతూ ఆదివారం పోలియో చుక్కలు వేయించుకో లేకపోయిన పిల్లలను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బంది జూన్ 29,30 తేదీల్లో ఇంటింటికీ సర్వే నిర్వహించి,చుక్కలు వేయనున్నారని, ప్రతి చిన్నారికి పోలియో రాకుండా పోలియో నిర్మూలన చుక్కలు వేయించాలని ప్రతి చిన్నారి ఆరోగ్యమే మన కుటుంబం,మన సమాజం యొక్క భవిష్యత్తు అని డాక్టర్ చేవూరు చిన్న అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ యన్ యం. యం.రేవతి,ఆశా వర్కర్ సిహెచ్ సౌజన్య,అంగన్వాడి వర్కర్స్ కె.విజయలత సిహెచ్.విజయ్ కుమారి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

*పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*

June 28, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

*రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్* 

అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):భావితరాల ఆరోగ్య భద్రత కోసం, పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని *రత్న సాన్వి వెల్ఫేర్ సోసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు* పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం నేరడిగొండ మండలం  వాంకిడిలోని జడ్పి ఎస్ ఎస్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని  సందర్శించారు. ఈ సందర్భంగా ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమాన్నిఉద్దేశించి అయన మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇటువంటి ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ మానస, బంధం రెగడి అంగన్వాడీ టీచర్ తూర్పు బాయి, సొసైటీ సభ్యులు ఓం కుమార్ గ్రామస్తులు ఇందల్ సింగ్, కైలాష్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ అలవెన్సులు విడుదల చేయాలి

June 28, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అలవెన్సులు విడుదల చేయాలని డిమాండ్

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా టిబి (క్షయవ్యాధి) ఉద్యోగులు ఈరోజు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా క్షయ వ్యాధి నివారణ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
క్షయవ్యాధి విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు POL (Petrol, Oil & Lubricants), వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చులు, FTA (Field Travel Allowance) అలవెన్సులు గత మూడు సంవత్సరాలుగా బకాయిలుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులు తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసి, భవిష్యత్తులో అలవెన్సులు సకాలంలో చెల్లించేలా ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన చేపట్టి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

నరేష్ కుమార్ కి ప్రశంస పత్రం

June 28, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 


ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో "డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన జీవితానికి అవును చెప్పండి" అనే సందేశంతో 5కే రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అఖిల్ మహాజన్ నాయకత్వం వహించారు.
ఈ 5కే రన్‌లో విద్యార్థులు, యువత, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలనకు తమ మద్దతు తెలిపారు. సమాజంలో ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న నరేష్ సేవలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుత సేవలు అందిస్తున్నందుకు ఆయనకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
నరేష్ చాలా కాలంగా రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ ఆసుపత్రి భద్రత, రోగులు మరియు వారి సహాయకులకు అవసరమైన సహకారం అందించడంలో విశేష సేవలు అందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. విధి పట్ల అంకితభావం, సమయపాలన, సేవా దృక్పథంతో పనిచేస్తూ పలువురి ప్రశంసలు అందుకున్నారని తెలిపారు.
ఇప్పటికే వివిధ సందర్భాల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా పలు ప్రశంసాపత్రాలు, అవార్డులు అందుకున్నారని, ఈ తాజా సత్కారం కూడా ఆయన సేవలకు మరో గుర్తింపుగా నిలిచిందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభినందించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు.

నేడు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం - డి ఎం ఐ హెచ్ ఓ డాక్టర్ సాధన

June 28, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

ఆదిలాబాద్ జిల్లాలో 77,910 మంది చిన్నారులే లక్ష్యం : డీఎంహెచ్వీ సాధన

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించడంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వాములు కావాలని, ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) డాక్టర్ సాధన పిలుపునిచ్చారు.
శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌తో పాటు పోలియో చుక్కల మందును ఆమె ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మూడు రోజులపాటు నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 77,910 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించకుండా మిగిలిపోకుండా ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని వివరించారు.
జిల్లాలో మొత్తం 730 పోలియో బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో ఈ బూత్‌లు పనిచేస్తాయని పేర్కొన్నారు. అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు వంటి రద్దీ ప్రదేశాల్లో 27 ప్రత్యేక మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందాలు ప్రయాణికులు, వలస కుటుంబాల చిన్నారులకు కూడా పోలియో చుక్కలు వేయనున్నాయని తెలిపారు.
పల్స్ పోలియో కార్యక్రమం కోసం జిల్లాకు మొత్తం 85,600 పోలియో డోసులు అందినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, పర్యవేక్షకులు, స్వచ్ఛంద కార్యకర్తలకు అవసరమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు.
జూన్ 28న జిల్లాలో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు బూత్‌లకు రాలేని లేదా ఏదైనా కారణంతో చుక్కలు వేయించుకోలేని చిన్నారులను గుర్తించి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు వివరించారు.
ప్రతి తల్లిదండ్రి తమ ఐదేళ్లలోపు పిల్లలను సమీప పోలియో బూత్‌కు తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రెండు చుక్కల మందు చిన్నారులను జీవితాంతం పోలియో బారిన పడకుండా కాపాడుతుందని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని కోరారు.
ఈ మీడియా సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వై.సి. శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి వెంకట్ రెడ్డి, సచిన్ తదితరులు పాల్గొన్నారు.

I

Saturday, June 27, 2026

నిమ్స్‌లో తొలిసారిగా AngioJet ద్వారా Acute DVTకు అత్యాధునిక చికిత్స విజయవంతం

June 27, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల విలువైన చికిత్సను ఉచితంగా అందించిన నిమ్స్

తెలంగాణ బ్యూరో, (ఆరోగ్య జ్యోతి):నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వాస్క్యులర్ సర్జరీ విభాగం వైద్యులు అత్యాధునిక AngioJet Pharmaco-Mechanical Thrombectomy విధానాన్ని ఉపయోగించి **Acute Deep Vein Thrombosis (DVT)**తో బాధపడుతున్న రోగికి విజయవంతంగా చికిత్స అందించారు. సిద్దిపేట జిల్లా, గజ్వేల్ మండలం, బయ్యారం గ్రామానికి చెందిన 39 ఏళ్ల మహిళ కొలిచేల్మి రజినీకి ఈ అత్యాధునిక చికిత్సను నిమ్స్‌లో తొలిసారిగా విజయవంతంగా నిర్వహించారు.

Deep Vein Thrombosis (DVT) అనేది కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టే తీవ్రమైన వ్యాధి. సకాలంలో చికిత్స అందించకపోతే ఆ గడ్డ ఊపిరితిత్తులకు చేరి Pulmonary Embolismకు దారితీసి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ఈ చికిత్సలో ఉపయోగించిన AngioJet Pharmaco-Mechanical Thrombectomy పద్ధతిలో ముందుగా రక్తం గడ్డను కరిగించే ప్రత్యేక ఔషధాలను నేరుగా గడ్డ ఉన్న ప్రాంతంలో ప్రవేశపెట్టి, అనంతరం AngioJet పరికరం సహాయంతో ఆ గడ్డను వేగంగా తొలగిస్తారు. దీనివల్ల రక్తప్రసరణ తక్షణమే పునరుద్ధరించబడటంతో పాటు రోగి త్వరగా కోలుకునే అవకాశం పెరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కాళ్ల వాపు, నొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.

ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ గారు మాట్లాడుతూ, సుమారు రూ.5లక్షల వరకు చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా పూర్తి చేశామని తెలిపారు.  అత్యాధునిక వైద్య చికిత్సలను ప్రజలకు ఉచితంగా అందించడం నిమ్స్‌కు గర్వకారణమని తెలియచేసారు 
 ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వాస్క్యులర్ సర్జరీ విభాగం హెచ్ ఓ డి డా. సందీప్ మహాపాత్ర మరియు డా. అనూష, డా. అరుణశ్రీ, డా. ఊహ, డా. శ్రీనిధి, డా. సుదర్శన్, డా. అమర్‌నాథ్, డా. త్రివిక్రమ్, డా. కీర్తన, డా. నలిన్ కృష్ణ, డా. నరేన్తో పాటు సహకరించిన అనస్థీషియాలజీ విభాగం, క్యాథ్ ల్యాబ్ బృందం, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర అనుబంధ వైద్య సిబ్బందిని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ గారు అభినందించారు.

ఈనెల 28న పోలియో చుక్కలు - మంత్రి దామోదర రాజనర్సింహ

June 27, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 


- ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

తెలంగాణ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి):రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్న  పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా బూత్‌లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా పోలియో డ్రాప్స్ అందించాలని స్పష్టం చేశారు. జూబ్లిహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జూన్ 28న రాష్ట్రవ్యాప్తంగా పోలియో బూత్‌లలో డ్రాప్స్ వేయనున్నట్లు, జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు మంత్రికి వివరించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు విస్తృతంగా ఉండటంతో జూలై 1న అదనంగా మరో రోజు కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రి సూచించారు.  

"ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్‌లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సుమారు 40.97 లక్షల మంది 0–5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 52.04 లక్షల బీవోపీవీ (bOPV) టీకా డోసులు జిల్లాలకు సరఫరా చేశారు. కార్యక్రమంలో 8,393 ఏఎన్‌ఎంలు, 27,181 ఆశా కార్యకర్తలు, 34,442 అంగన్‌వాడీ కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు.  

వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.  

తెలంగాణలో చివరి పోలియో కేసు 2007లో నమోదు అయిందని, పోలియో రహిత తెలంగాణ లక్ష్యాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే సాధించామని‌ ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. 

“జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో టీకా వేయించాలి. గతంలో పోలియో చుక్కలు వేయించినా మరోసారి వేయించడం వల్లే పూర్తి రక్షణ లభిస్తుంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్‌కు తీసుకువచ్చి టీకా వేయించాలి. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా అందరూ సహకరించి తెలంగాణ, దేశం పోలియో రహిత హోదాను కొనసాగిద్దాం” అని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.

Friday, June 26, 2026

39 మందిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స - SP అఖిల్ మహాజన్

June 26, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025452




 40 మందికి గంజాయి టెస్టింగ్ కిట్లతో పరీక్షలు... 10 మందికి పాజిటివ్

 *గంజాయి వ్యసనానికి చికిత్సే మార్గం... డి-అడిక్షన్ సెంటర్లకు తరలింపు

 *ఇప్పటివరకు 39 మందిని డి అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స

 *గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణానికి పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ* 

 *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* 

 గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో "యాంటీ డ్రగ్ వీక్" సందర్భంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలతో పాటు వ్యసనానికి బానిసైన వారిని గుర్తించి వారికి చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో, గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన వ్యక్తులను గుర్తించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు 40 మందికి గంజాయి టెస్టింగ్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా, అందులో 10 మందికి గంజాయి సేవించినట్లు పాజిటివ్ వచ్చినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి సేవించినట్లు గుర్తించిన వారిని తదుపరి వైద్య పరీక్షల అనంతరం డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి, నిపుణుల పర్యవేక్షణలో కౌన్సెలింగ్, వైద్య చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 39 మంది వ్యసనాపరులను డి అడిక్షన్ సెంటర్కు తరలించి చికిత్సను అందించడం జరిగిందని తెలిపారు. వ్యసనానికి బానిసైన వ్యక్తులను శిక్షించడం మాత్రమే కాకుండా, వారికి సరైన చికిత్స అందించి కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ జీవితం గడిపేలా చేయడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. గంజాయి సేవించే వ్యక్తులు స్వచ్ఛందంగా వ్యసన విముక్తి కేంద్రాలను ఆశ్రయించాలని, కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని గుర్తించి చికిత్సకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీస్ అధికారులకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, పండించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. "గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా" లక్ష్య సాధన కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్, డి-అడిక్షన్ కార్యక్రమాలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

Thursday, June 25, 2026

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

June 25, 2026
నరేష్ కుమార్ ఎడిటర్ 9848025451

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారీ డాక్టర్.బీ సాంబశివరావు*

వరంగల్ ,(ఆరోగ్యం):ఎస్.ఆర్.ఆర్.తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సేవల పర్యవేక్షణ, నూతన భవన నిర్మాణ పనుల పరిశీలనజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి. సాంబశివరావు గురువారం అక్కడ అందిస్తున్న వైద్య సేవలు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును సమీక్షించారు.ఈ సందర్భంగా రోగులకు అందుతున్న సేవలు, వైద్య రికార్డులు, ఔషధాల లభ్యత, మాతా - శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, యూ-విన్, ఎన్.సి.డీ, టీకా కార్యక్రమం తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు. సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు వైద్య సిబ్బందికి, ఆరోగ్య కార్యకర్తలకు పలు సూచనలు అందించారు.అనంతరం యూ.పీ.హెచ్‌.సీ ఎస్.ఆర్.ఆర్.తోటకు నిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని డాక్టర్.బి. సాంబశివరావు  తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్.అనిత,  అకౌంటెంట్ శ్వేత, రామ రాజేష్ ఖన్నా  ఉన్నారు..

Monday, June 15, 2026

మే నెల జీతం మరియు 7 నెలల పి.ఆర్.సి. ఏరియర్స్ తక్షణమే చెల్లించాలి

June 15, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 


ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

తెలంగాణ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి):తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్. హెచ్.ఎం) కింద పనిచేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా  ప్రతి నెల వేతనాలు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉద్యోగులు పడుతున్నారని  ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్  ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు సుమారు 17 వేల మంది  ఉద్యోగులు  పొరుగు సేవల (కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) విధానంలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్నారు. 78 విభాగాల్లో వీరు సేవలందిస్తున్నారు. కానీ వీరికి అనేక సమస్యలు వెంటాడుతున్నాయని  ముఖ్యమైన సమస్యలు  అనగా మే  నెలల వేతనము మరియు ఏడు నెలల పి.ఆర్.సి. ఏరియర్స్   తక్షణమే చెల్లించాలని, ప్రతి నెలా 1వ తేదీ నే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఈనెల తొమ్మిదిన సర్కులర్ జారీ చేశారని రామ రాజేష్ అన్న పేర్కొన్నారు. అది సర్కులర్ ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం కోరుతున్నాం.. ముఖ్యంగా ఇంటి పోషణ అనగా  పిల్లల బడి ఫీజులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లు, పాఠ్య పుస్తకాలు , ఇంటి అద్దె ,  లేక ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ పనిచేస్తున్నారని ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కావున వెంటనే సమస్య పరిష్కరించి వేతనాము మరియు ఎరియర్స్ చెల్లించాలని..

Sunday, June 14, 2026

రక్తదానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

June 14, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదీవే నగర్ కాలనీకి చెందిన పద్మ రక్తదానం చేయడంలో ముందున్నారు. రక్తం ఎవరికైనా అవసరం ఉందంటే వెంటనే ఆమె స్పందించి రక్తదానం చేస్తారు ఒకవేళ రక్తదానం చేసేందుకు వీలు కానట్లయితే ఇతరులచే రక్తదానం చేయిస్తారు పద్మ. ఇప్పటివరకు చాలా సందర్భాల్లో పద్మ రక్తదానం చేశారు. సందర్భంగా పద్మ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలిపారు రక్తదానం కేవలం మగవారు మాత్రమే చేయాలని ఏమీ లేదని మహిళలు కూడా ముందుకు వచ్చే స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేయడం వల్ల బలహీనత రక్తం తగ్గుతుంది అనే అపోహాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. తాను ఇప్పటివరకు ఐదు సార్ల రక్తదానం చేశానని తెలిపారు రాయబోయే రోజుల్లో కూడా రక్తదానం చేసేందుకు ముందు ఉంటానని తెలిపారు. మహిళల్లో రక్తదానంపై అవగాహన లేకపోవడం వల్ల మహిళలు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం లేదని కానీ రక్తదానం చేసేందుకు మహిళలు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

Wednesday, May 27, 2026

*ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడి

May 27, 2026
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి ):రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో,మెడికల్ కాలేజీలలో, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని ఆసుపత్రులలో పనిచేస్తున్న సెక్యూరిటీ,శానిటేషన్, పేషంట్ కేర్,స్వీపర్ ఇతర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యాద నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కోటి డిఎంఈ  కార్యాలయం ముందు ధర్నా జరిగింది, ఈ ధర్నాను ఉద్దేశించి యాద నాయక్ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను వైద్య విద్య సంచాలకులు గారికి, కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ గారికి ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 20 రోజులలో వేతనాల పెంపు మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 20 రోజులు లోపు వేతనాలు పెంచకపోతే దశల వారి ఆందోళన పోరాటాలు అవసరమైతే నిరవధిక సమ్మెకు ఉద్యోగులందరూ సిద్ధపడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాద నాయక్ పిలుపునిచ్చారు.
 ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జె సుధాకర్, రమేష్, ప్రకాష్, దేవిదాస్, సుమన్,కర్ణాకర్,రాజు, కుమారస్వామి, విజయ సదానందం రమేష్ తిరుపతి, మైపాల్, జంపయ్య మనోహర్ తదితరులు పాల్గొన్నారు

Sunday, January 18, 2026

నర్సింగ్ ఆఫీసర్ల మెరిట్ జాబితా విడుదల.ANM 1931 పోస్టు తో పాటు..7267 వివిధ పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి.. వైద్య ఆరోగ్యశాఖలో9572 పోస్టుల భర్తీ పూర్తి

January 18, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల

1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్న బోర్డు

భర్తీకానున్న 2,322 పోస్టులు
--
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి):ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే 1257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను శనివారం విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులు, ఇతరత్రా వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మొత్తం 2322 పోస్టులకుగానూ 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ లిస్టులో ఉన్న వారికి ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు. వెంగళరావు నగర్‌లోని‌ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుండగా, ఎవరెవరు ఎప్పుడు వెరిఫికేషన్‌కు రావాలనే వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు బోర్డు సూచించింది. 2024లో 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2322 పోస్టులను భర్తీ చేస్తోంది. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సింగ్ ఆఫీసర్ల కొరత పూర్తిగా తీరిపోనుంది.

 *రికార్డు స్థాయిలో నియామకాలు* 
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో 9,572 పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం భర్తీ పూర్తయిన వాటితో సరిపెట్టుకోకుండా, 2026లో మరో 7,267 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) పోస్టులు, స్పెషలిస్ట్ డాక్టర్లు (టీవీవీపీ) పోస్టులు, ఫార్మసిస్టులు (గ్రేడ్-2) పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, తదితర పోస్టులు ఉన్నాయి.

 *నాడు 18 వేలకుపైగా ఖాళీలు* 
ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. ఇప్పటివరకు భర్తీ చేసినవి, ప్రస్తుతం ప్రక్రియలో ఉన్నవి కలుపుకుని ఈ ఏడాది జూన్ నాటికి సుమారు 16,839 పోస్టులు భర్తీ కానున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌ఎస్ సర్కార్, 2020లో కోవిడ్ వచ్చే వరకూ అసలు ప్రభుత్వ వైద్య వ్యవస్థను పట్టించుకోలేదు. కోవిడ్‌లో ప్రభుత్వ హాస్పిటళ్ల డొల్లతనాన్ని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టడం, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో.. చివరి మూడు సంవత్సరాలు హాస్పిటళ్ల అప్‌గ్రెడేషన్‌కు భారీగా జీవోలు ఇచ్చారు. అక్కడక్కడ కొత్త భవనాల నిర్మాణ పనులను మొదలు పెట్టి, పూర్తి చేయలేకపోయారు. ఇక డాక్టర్లు, సిబ్బంది రిక్రూట్‌మెంట్ సంగతి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వెరసి 2023 డిసెంబర్‌‌లో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి, ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీ పోస్టుల సంఖ్య 18 వేలు దాటింది. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆరోగ్యశాఖ మంత్రిగా సీనియర్ నాయకుడు దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీలు అన్నీ భర్తీ చేస్తేనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలమని ఆయన భావించి, ఖాళీల భర్తీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 

 *జూన్ నాటికి 16 వేల పోస్టుల భర్తీ* 
మంత్రి దామోదర్ పర్యవేక్షణ, వరస రివ్యూలు, కోర్టు కేసులపై ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ వాటిని క్లియర్ చేయించడంతో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేయనన్న పోస్టులను ఈ రెండేళ్లలో ఆరోగ్యశాఖలో భర్తీ చేయడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న 18 వేలకుపైగా పోస్టుల్లో, ఈ ఏడాది జూన్ నాటికి 16,839 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతోంది. అనంతరం మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది.  క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంల నుంచి మొదలుకొని స్పెషలిస్ట్ డాక్టర్ల వరకు అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి.


 *ఇప్పటికే భర్తీ పూర్తయిన పోస్టుల వివరాలు* :
నర్సింగ్ ఆఫీసర్లు: 6,956
ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్-2): 1,542
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (CAS): 425
జూనియర్ అసిస్టెంట్లు (గ్రూప్-4): 334
ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు: 138
ఫిజియోథెరపిస్టులు: 48
జూనియర్ అసిస్టెంట్లు (గ్రూప్-3): 39
అసిస్టెంట్ ప్రొఫెసర్లు (MNJ): 28
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు: 24
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (గ్రూప్-1): 20
డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు: 18
మొత్తం: 9,572

 *భర్తీ ప్రక్రియలో ఉన్న (In Progress) పోస్టులివే* :
నర్సింగ్ ఆఫీసర్లు: 2,322
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్): 1,931
స్పెషలిస్ట్ డాక్టర్లు (టీవీవీపీ): 1,623
ఫార్మసిస్టులు (గ్రేడ్-2): 732
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 607
డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు: 48
స్పీచ్ పాథాలజిస్టులు: 4
మొత్తం: 7,267

Bottom Ad Space

Veda Software Ad