Advertising Banner

Veda Software Banner

Top Banner

My Blog List

Monday, June 15, 2026

మే నెల జీతం మరియు 7 నెలల పి.ఆర్.సి. ఏరియర్స్ తక్షణమే చెల్లించాలి

June 15, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 


ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

తెలంగాణ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి):తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్. హెచ్.ఎం) కింద పనిచేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా  ప్రతి నెల వేతనాలు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉద్యోగులు పడుతున్నారని  ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్  ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు సుమారు 17 వేల మంది  ఉద్యోగులు  పొరుగు సేవల (కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) విధానంలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్నారు. 78 విభాగాల్లో వీరు సేవలందిస్తున్నారు. కానీ వీరికి అనేక సమస్యలు వెంటాడుతున్నాయని  ముఖ్యమైన సమస్యలు  అనగా మే  నెలల వేతనము మరియు ఏడు నెలల పి.ఆర్.సి. ఏరియర్స్   తక్షణమే చెల్లించాలని, ప్రతి నెలా 1వ తేదీ నే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఈనెల తొమ్మిదిన సర్కులర్ జారీ చేశారని రామ రాజేష్ అన్న పేర్కొన్నారు. అది సర్కులర్ ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన ప్రభుత్వం కోరుతున్నాం.. ముఖ్యంగా ఇంటి పోషణ అనగా  పిల్లల బడి ఫీజులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లు, పాఠ్య పుస్తకాలు , ఇంటి అద్దె ,  లేక ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల కుటుంబం చాలా ఇబ్బంది పడుతూ పనిచేస్తున్నారని ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కావున వెంటనే సమస్య పరిష్కరించి వేతనాము మరియు ఎరియర్స్ చెల్లించాలని..

Sunday, June 14, 2026

రక్తదానానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

June 14, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రణదీవే నగర్ కాలనీకి చెందిన పద్మ రక్తదానం చేయడంలో ముందున్నారు. రక్తం ఎవరికైనా అవసరం ఉందంటే వెంటనే ఆమె స్పందించి రక్తదానం చేస్తారు ఒకవేళ రక్తదానం చేసేందుకు వీలు కానట్లయితే ఇతరులచే రక్తదానం చేయిస్తారు పద్మ. ఇప్పటివరకు చాలా సందర్భాల్లో పద్మ రక్తదానం చేశారు. సందర్భంగా పద్మ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలిపారు రక్తదానం కేవలం మగవారు మాత్రమే చేయాలని ఏమీ లేదని మహిళలు కూడా ముందుకు వచ్చే స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేయడం వల్ల బలహీనత రక్తం తగ్గుతుంది అనే అపోహాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలన్నారు. తాను ఇప్పటివరకు ఐదు సార్ల రక్తదానం చేశానని తెలిపారు రాయబోయే రోజుల్లో కూడా రక్తదానం చేసేందుకు ముందు ఉంటానని తెలిపారు. మహిళల్లో రక్తదానంపై అవగాహన లేకపోవడం వల్ల మహిళలు రక్తదానం చేసేందుకు ముందుకు రావడం లేదని కానీ రక్తదానం చేసేందుకు మహిళలు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

Wednesday, May 27, 2026

*ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచడి

May 27, 2026
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి ):రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో,మెడికల్ కాలేజీలలో, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని ఆసుపత్రులలో పనిచేస్తున్న సెక్యూరిటీ,శానిటేషన్, పేషంట్ కేర్,స్వీపర్ ఇతర కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యాద నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని కోటి డిఎంఈ  కార్యాలయం ముందు ధర్నా జరిగింది, ఈ ధర్నాను ఉద్దేశించి యాద నాయక్ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు ఉద్యోగ భద్రత సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను వైద్య విద్య సంచాలకులు గారికి, కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ గారికి ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 20 రోజులలో వేతనాల పెంపు మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. 20 రోజులు లోపు వేతనాలు పెంచకపోతే దశల వారి ఆందోళన పోరాటాలు అవసరమైతే నిరవధిక సమ్మెకు ఉద్యోగులందరూ సిద్ధపడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాద నాయక్ పిలుపునిచ్చారు.
 ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జె సుధాకర్, రమేష్, ప్రకాష్, దేవిదాస్, సుమన్,కర్ణాకర్,రాజు, కుమారస్వామి, విజయ సదానందం రమేష్ తిరుపతి, మైపాల్, జంపయ్య మనోహర్ తదితరులు పాల్గొన్నారు

Sunday, January 18, 2026

నర్సింగ్ ఆఫీసర్ల మెరిట్ జాబితా విడుదల.ANM 1931 పోస్టు తో పాటు..7267 వివిధ పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి.. వైద్య ఆరోగ్యశాఖలో9572 పోస్టుల భర్తీ పూర్తి

January 18, 2026
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల

1:1.5 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్న బోర్డు

భర్తీకానున్న 2,322 పోస్టులు
--
తెలంగాణ బ్యూరో, (ఆరోగ్యజ్యోతి):ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే 1257 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను శనివారం విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులు, ఇతరత్రా వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. మొత్తం 2322 పోస్టులకుగానూ 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ లిస్టులో ఉన్న వారికి ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి, అనంతరం సెలక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు. వెంగళరావు నగర్‌లోని‌ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుండగా, ఎవరెవరు ఎప్పుడు వెరిఫికేషన్‌కు రావాలనే వివరాలను వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అభ్యర్థులకు బోర్డు సూచించింది. 2024లో 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మరో 2322 పోస్టులను భర్తీ చేస్తోంది. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సింగ్ ఆఫీసర్ల కొరత పూర్తిగా తీరిపోనుంది.

 *రికార్డు స్థాయిలో నియామకాలు* 
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు చేపట్టిన తర్వాత రికార్డు స్థాయిలో 9,572 పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం భర్తీ పూర్తయిన వాటితో సరిపెట్టుకోకుండా, 2026లో మరో 7,267 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ వేగవంతం చేసింది. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) పోస్టులు, స్పెషలిస్ట్ డాక్టర్లు (టీవీవీపీ) పోస్టులు, ఫార్మసిస్టులు (గ్రేడ్-2) పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, తదితర పోస్టులు ఉన్నాయి.

 *నాడు 18 వేలకుపైగా ఖాళీలు* 
ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. ఇప్పటివరకు భర్తీ చేసినవి, ప్రస్తుతం ప్రక్రియలో ఉన్నవి కలుపుకుని ఈ ఏడాది జూన్ నాటికి సుమారు 16,839 పోస్టులు భర్తీ కానున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌ఎస్ సర్కార్, 2020లో కోవిడ్ వచ్చే వరకూ అసలు ప్రభుత్వ వైద్య వ్యవస్థను పట్టించుకోలేదు. కోవిడ్‌లో ప్రభుత్వ హాస్పిటళ్ల డొల్లతనాన్ని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టడం, ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో.. చివరి మూడు సంవత్సరాలు హాస్పిటళ్ల అప్‌గ్రెడేషన్‌కు భారీగా జీవోలు ఇచ్చారు. అక్కడక్కడ కొత్త భవనాల నిర్మాణ పనులను మొదలు పెట్టి, పూర్తి చేయలేకపోయారు. ఇక డాక్టర్లు, సిబ్బంది రిక్రూట్‌మెంట్ సంగతి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వెరసి 2023 డిసెంబర్‌‌లో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి, ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీ పోస్టుల సంఖ్య 18 వేలు దాటింది. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆరోగ్యశాఖ మంత్రిగా సీనియర్ నాయకుడు దామోదర్ రాజనర్సింహ బాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీలు అన్నీ భర్తీ చేస్తేనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలమని ఆయన భావించి, ఖాళీల భర్తీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 

 *జూన్ నాటికి 16 వేల పోస్టుల భర్తీ* 
మంత్రి దామోదర్ పర్యవేక్షణ, వరస రివ్యూలు, కోర్టు కేసులపై ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ వాటిని క్లియర్ చేయించడంతో ఖాళీల భర్తీ ప్రక్రియ వేగంగా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చేయనన్న పోస్టులను ఈ రెండేళ్లలో ఆరోగ్యశాఖలో భర్తీ చేయడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఖాళీగా ఉన్న 18 వేలకుపైగా పోస్టుల్లో, ఈ ఏడాది జూన్ నాటికి 16,839 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తవుతోంది. అనంతరం మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది.  క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంల నుంచి మొదలుకొని స్పెషలిస్ట్ డాక్టర్ల వరకు అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తుండటంతో ప్రభుత్వ వైద్య సేవలు మరింత బలోపేతం కానున్నాయి.


 *ఇప్పటికే భర్తీ పూర్తయిన పోస్టుల వివరాలు* :
నర్సింగ్ ఆఫీసర్లు: 6,956
ల్యాబ్ టెక్నీషియన్లు (గ్రేడ్-2): 1,542
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (CAS): 425
జూనియర్ అసిస్టెంట్లు (గ్రూప్-4): 334
ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు: 138
ఫిజియోథెరపిస్టులు: 48
జూనియర్ అసిస్టెంట్లు (గ్రూప్-3): 39
అసిస్టెంట్ ప్రొఫెసర్లు (MNJ): 28
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు: 24
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు (గ్రూప్-1): 20
డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు: 18
మొత్తం: 9,572

 *భర్తీ ప్రక్రియలో ఉన్న (In Progress) పోస్టులివే* :
నర్సింగ్ ఆఫీసర్లు: 2,322
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్): 1,931
స్పెషలిస్ట్ డాక్టర్లు (టీవీవీపీ): 1,623
ఫార్మసిస్టులు (గ్రేడ్-2): 732
అసిస్టెంట్ ప్రొఫెసర్లు: 607
డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు: 48
స్పీచ్ పాథాలజిస్టులు: 4
మొత్తం: 7,267

Tuesday, November 25, 2025

పిఎఫ్ చందాదారుల సమస్య పరిష్కారానికి పీఎఫ్ అధికారులతో సమావేశం

November 25, 2025
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

ఉట్నూరు,(ఆరోగ్యజ్యోతి): అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో బిఎఫ్ చందాదారుల సమస్యలు మరియు ఇతర వాటిని పరిష్కరించేందుకు పీఎఫ్ అధికారులు ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంకంటి సుభాష్ తెలిపారు 
. ఈ సమావేశానికి ఈపీఎఫ్ఓ కరీంనగర్ నుండి అమిత్ ఖాజా సహబ్ ఇన్ఫర్మేషన్ మరియు ఎస్ ఎస్ ఏ ఎన్ శ్రీధర్ హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉటూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కు సంబంధించిన పిఎఫ్ సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. పిఎఫ్ కు సంబంధించిన రకరకాల సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్తే సమస్యకు పరిష్కారించడంతోపాటు కొన్ని సమస్యలకు పరిష్కారం మార్గాలు సూచిస్తారని ఆయన వివరించారు.

Saturday, November 22, 2025

పోలీసు మెగా మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి పోలీసు కమీషనర్: సన్ ప్రీత్సింగ్

November 22, 2025
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

వరంగల్,(ఆరోగ్యజ్యోతి): పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక వైద్య పరీక్షల కోసం రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పోలీసు కమీషనర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సన్ ప్రీత్సింగ్ మాట్లాడుతూ నిరంతరం శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తూ ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్ళకు గురి అవుతుంటారని అన్నారు. నిత్యం వ్యాయామం, వాకింగ్, యోగా లాంటివి క్రమం తప్పకుండా చేస్తూ ఒత్తిళ్ళను అధిగమిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. పోలీసుల వారి కుటుంబాల ఆరోగ్య సంక్షేమానికి పోలీసు శాఖ ఎప్పటికి అండగా ఉంటుందన్నారు. ఈస్ట్ జోన్ డి.సి.పి. అంకిత్ కుమార్ మాట్లాడుతూ తరచూ ఇలాంటి వైద్య శిభిరాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. మెడికవర్ హాస్పిటల్, భగీరథ్ కార్డియాక్్కర్ మెఘన మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్, కొరివి నవీన్ అడ్వాన్స్ న్యూరోకేర్ హాసుపత్రులు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిభిరంలో న్యూరోలాజి వైద్యులు డా॥ కొరివి నవీన్, డా॥ ప్రియాంక, కార్డియాలజిస్ట్ డా॥సంతోష్ మధాని, గ్యాస్ట్రో వైద్యులు వెంకటేశ్వర్లు లతో పాటు కంటి వైద్యులు, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ ప్రత్యేక వైద్యులు శుక్రవారం రోజు సుమారు 900 మందికి అవసరమైన వైద్య చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ డి.సి.పి.లు యం. సురేష్ కుమార్, రవి, శ్రీనివాస్, బాలస్వామి, ప్రభాకర్ రావు, ఎ.సి.పి.లు జానీ నర్సింహులు, సురేందర్, జితేందర్ రెడ్డి, డేవిడ్రాజ్, నాగన్న, అనంతయ్య లతో పాటు పలు పోలీసు అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, డా॥ అల్లం అప్పయ్య, హనుమకొండ సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఇంచార్జి ఫార్మసీ అధికారి ఉప్పు భాస్కర్ రావు లు పాల్గొన్నారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ద్వారా సుమారు 5లక్షల విలువైన మందులను ఈ శిభిరం కోసం అందించినట్టు డా|| అప్పయ్య, ఉప్పు భాస్కర్ రావు లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నమ్రత, హరినాథ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Tuesday, October 14, 2025

గ్రీన్ చట్నీతో అందం ఆరోగ్యం మీ సొంతం

October 14, 2025
గ్రీన్ చట్నీతో అందం ఆరోగ్యం మీ సొంతం గ్రీన్ చట్నీలో విటమిన్ మినరల్స్ ఎన్నో ఇది వాడడం వల్ల శరీరానికి ఎనర్జీ జబ్బులు దూరం వ్యాసకర్త శిరీష అందిస్తున్న ప్రత్యేక వ్యాసం తెలంగాణ బ్యూరో,(ఆరోగ్యజ్యోతి):స్పెషల్
చట్నీ అనేది సాధారణంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వంటి ఆకులతో తయారుచేసే చట్నీ, దీనిలో కొన్ని ప్రత్యేక పదార్థాలు కలుపుతారు, దీని వలన రుచి, సువాసన మరియు ఆరోగ్య లాభాలు ఎక్కువవుతాయి. స్పెషల్ గ్రీన్ చట్నీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో వాడే ఇందులో వాడే ప్రతి వస్తువుతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు ఒకవైపు రుచి కమ్మటి గుమగుమలాడే వాసన తో పాటు మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ క్యాల్షియం మెగ్నీషియం జింక్ తో పాటు తదితర వాటినే అందిస్తుందని వ్యాసకర్త శిరీష తెలిపారు. వారానికి ఒకటి రెండు సార్లు స్పెషల్ గ్రీన్ చట్నీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని శిరీష వివరించారు.. పుదీనా లో.. విటమిన్ ఏ, మరియు సి, మినరల్స్, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్ ఉంటుంది. పుదీనా వల్ల జీర్ణక్రియకు సహాయం చేస్తుంది నోటి వాసన తగ్గిస్తుంది చెల్లదనాన్ని ఇస్తుంది. కొత్తిమీరలో… విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఏ, బి, టు బి 6, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.. జీర్ణశక్తి పెంపు ఆరోగ్యం రక్తంలో చక్కెర నియంత్రణ గుండె ఆరోగ్యం మూత్ర సంబంధిత సమస్యలు జలుబు దగ్గు వీటిని కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది కొత్తిమీర.. గోధుమ గడ్డి లో… విటమిన్ ఏ&సి, ఈ, కే, బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ఉంటుంది. సుమారు 17 రకాల అమినో ఆమ్లాలు ఉంటాయి. శరీరానికి పనిచేయడంలో కీలకపాత్ర వహిస్తున్న పీరోపిల్ ఇందులో ఉంటుంది. రక్త శుద్ధి చేయడం ఈమిన్ సిస్టంను బలపరుస్తుంది జీర్ణవ్యవస్థకు సహాయం చేస్తుంది చర్మానికి క్రాంతినిస్తుంది బరువు తగ్గటానికి సహకరిస్తుంది రక్తహీనత నివారిస్తుంది ఆలయాన్ని శుభ్రం చేస్తుంది.. మునగాకులో… పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కంటిచూపుకు మంచి చేసే విటమిన్ ఏ, రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి, చర్మం జుట్టుకు ఉపయోగపడే విటమిన్ ఈ, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చర్మం మెరుస్తుంది ముడతలు తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది రక్తహీనత తగ్గిస్తుంది షుగర్ ని నియంత్రణలో సహాయపడుతుంది ఎముకలను బలంగా ఉంచుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ లో సహాయం చేస్తుంది. జుట్టు పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పచ్చిమిర్చి.. ఇది మన అందరికీ తెలిసింది ఇందులో విటమిన్ సి మరియు ఏ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది.. పచ్చిమిర్చి వాడడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణ క్రియ మెరుగుదల రక్తప్రసరణ మెరుగుపరచడం బరువు తగ్గడంలో సహాయం హృదయ ఆరోగ్యం కాపాడుతుంది తలనొప్పి సైనస్ సమస్యలను ఉపశమనం చేస్తుంది.. వెల్లుల్లి: వెల్లుల్లి వాడటం వల్ల మన శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి రక్తపోటు నియంత్రణ కొలెస్ట్రాల్ తగ్గించడం గుండె సంబంధిత వ్యాధులు రోగనిరోధక శక్తి పెరుగుదల జలుబు దగ్గు తగ్గింపు లాంటి ఉన్నవి. టమాటో.. టమాటాలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, పొటాషియం, విటమిన్ బి 9, యాంటీ ఆక్సిడెంట్లు తదితర విటమిన్స్ ఉంటాయి. ఇవి వాడడం వల్ల కళ్ళ ఆరోగ్యం జీర్ణశక్తి పెరుగుతుంది హృదయ ఆరోగ్య మెరుగుపరుస్తుంది చర్మం కాంతివంతంగా మారుస్తుంది క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది బరువు నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. చింతపండు చింతపండులో అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి 100 గ్రాములు చింతపండులో దొరికే శక్తి 239 క్యాలరీల శక్తి ఉంటుం.ది అలాగే కార్బోహైడ్రేట్స్ 62 గ్రాములు, ప్రోటీన్ 2.8 గ్రాములు, ఫైబర్ 5.1 గ్రాములు, క్యాల్షియం 74 మిల్లీ గ్రాములు, ఐరన్ రెండు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాములు, విటమిన్ సి 3.5 గ్రాములు, పోషక విలువలు ఉంటాయి. ఇది వాడడం వల్ల జీర్ణశక్తి పెంపు హృదయపూర్వక ఇన్ఫెక్షన్ల నిరోధం లివర్ పరిశుభ్రత చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. ఇన్ని పోషక లో ఉన్న స్పెషల్ గ్రీన్ చట్నీని మనకు అందిస్తున్నారు శిరీష స్పెషల్ గ్రీన్ చట్నీ తయారు ఎలా చేస్తారో క్రింది ఆమె మాటల్లో వచ్చింది చూద్దాం.. కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర,కర్వేపాకు,గోధుమ గడ్డి, మునగాకు,పచ్చిమిర్చి – 6,ఎండు మిర్చి – 4,వెల్లుల్లి – 10,టమాటాలు - పెద్దవి 4,చింతపండు - చిన్న నిమ్మకాయ సైజ్ ,ఉప్పు – తగినంత,ఆయిల్ - కాస్త తక్కువ, జీలకర్ర తయారీ విధానం : ఒక గిన్నె తీసుకుని , ఆయిల్ వేసి , ఆయిల్ వేడి అయ్యాక కొంచం జీలకర్ర , పచ్చిమిర్చి ,వెల్లుల్లి రెబ్బలు వేసాక కాస్త వేపి ఎండు మిర్చి వేసి ఒక నిమిషం వేగాక ఆకుకూరలు అన్ని వేసి , ఒక 10 మినిట్స్ పచ్చి వాసన పోయేదాకా వేపి , టమాటా ముక్కలు , ఉప్పు , చింతపండు వేసి ఉడికే వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేయడమే... మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు.. జస్ట్ మగ్గితే చాలు... చల్లారాక మిక్సీలో వేసి రుబ్బుకోవడమే. స్పెషల్ గ్రీన్ చట్నీ రెడీ... రోటీ, చపాతీ, దోసె, ఇడ్లీతో,రైస్ లేదా బిర్యానీతో,స్నాక్స్, సమోసా లేదా పకోడీతో,సాండ్‌విచ్ లేదా మీరు కావాలంటే, చట్నీని ఎక్కువ సేపు నిల్వ చేసుకునే ట్రిక్‌లు కూడా చెప్పగలను.

Sunday, October 5, 2025

4వ తరగతి ఉద్యోగులకు వేతనాలు పెంచండి

October 05, 2025
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451 

ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

హైదరాబాద్ బ్యూరో,(ఆరోగ్య జ్యోతి): ఎన్ హెచ్ ఎం లో పనిచేయుచున్నటు వంటి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని గత 3 సంవత్సరాలుగా పోరా టాలు నిర్వహించిన ఫలితం రాలేదనీ నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ కన్నా అన్నారు.ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ నాలుగవ తరగతి ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ కేవలం 10,400 ఇవ్వడం కరెక్ట్ కాదని నాలుగవ తరగతి ఉద్యోగులకు అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటీలోని ఎన్ హెచ్ ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు జూలై 26 న మహాధర్నా నిర్వహించటం జరిగింద మీ పేర్కొన్నారు. కానీ ఇది జరిగి ఇప్పటికీ 2 నెలలు అవుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేద నీ వెంటనే నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలని ఎన్ హెచ్ ఎం కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు ఎన్ హెచ్ ఎం లో అధికారులు ఈ సంస్థలో పనిచేయుచు న్నటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఇందులో కొంత మందికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జీతాలు చెల్లిస్తూ కింది స్థాయి 4వ తరగతి ఉద్యోగులకు మాత్రం వారి పొట్ట కొడుతూ శ్రమదోపిడికి గురిచేయుచున్నారని వారు విమర్శించారు. తక్షణమే జీవో నెంబర్ 1195 లో నాలుగో తరగతి ఉద్యోగులకు 15,600 తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు...

Monday, September 29, 2025

అక్టోబర్ 12న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం

September 29, 2025
ఎడిటర్ కే నరేష్ కుమార్ 9848025451 

పిల్ల‌ల బంగారు భవిష్య‌త్తుకు   రెండు ప‌ల్స్ పోలియో చుక్క‌లు.

స్ల‌మ్ ఏరియాల్లో ప్ర‌త్యేకంగా దృష్టి సారించాలి.

జిల్లాలో అక్టొబ‌ర్ 12వ తేది ప‌ల్స్ పోలియో  కార్య‌క్ర‌మం .

జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్  క‌దిర‌వ‌న్ ప‌ల‌ని 

హైదరాబాద్, (ఆరోగ్య జ్యోతి): అక్టోబర్ 12న పల్స్ పోలియో ఇమేజెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ కదిరవన్ పలాని తెలిపారు.
0-5 సంవ‌త్స‌రాల చిన్నారుల బంగారు భ‌విష్య‌త్తుకు  త‌ల్లి దండ్రుల బాధ్య‌త తీసుకుని,  ప‌ల్స్ పోలియో  చుక్క‌ల‌ను త‌ప్ప‌ని స‌రిగా వేయించి,  పోలియో నిర్మూల‌న‌కు సహకరించాలని  జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ ( లోక‌ల్ బాడీస్‌) క‌దిర‌వ‌న్ ప‌ల‌ని పేర్కొన్న‌రు. 

సోమ‌వారం క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో  అక్టోబ‌ర్ 12వ తేదిన  నిర్వ‌హించ‌నున్న  ప‌ల్స్ పోలియో  కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు  చేప‌ట్ట‌వ‌ల్సిన‌  ఏర్పాట్ల పై  మెడిక‌ల్‌, విద్యా శాఖ‌,  జిల్లా సంక్షేమ శాఖ అధికారులు,  స్వ‌చ్చంద సంస్ధ‌లు,  విద్యుత్ , త‌దిత‌ర  శాఖ‌ల‌కు సంబంధిత  అధికారులతో  జిల్లా రెవెన్యూ  అధికారి ఈ. వెంక‌టాచారితో క‌లిసి అద‌న‌పు క‌లెక్ట‌ర్  స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ  జిల్లాలో  అక్టోబ‌ర్ 12వ తేదిన  ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు  అనుబంధ  శాఖ అధికారులు స‌మ‌న్వ‌యంతో  వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు.  చిన్నారుల‌కు త‌ప్ప‌ని స‌రిగా ప‌ల్స్ పోలియో చుక్క‌ల‌ను వేయించాలని తెలిపారు.  12వ తేదిన  బూతుల వ‌ద్ద మిస్ అయిన  పిల్ల‌ల కోసం   13, 14,  15 వ‌ తేదీల‌లో 5600 బృందాలు ఇంటి ఇంటికి తిరిగి చుక్క‌లు వేస్తారని అయ‌న పేర్కొన్నారు. 

 హైద‌రాబాద్ జిల్లాలో సుమారు  0-5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు  గ‌ల 5,17,238 పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు వేసేందుకు దాదాపు   2800 బూతులు, 43 ట్రాన్సిట్ పాయింట్లు అలాగే 91 మొబైల్ బృందాల‌ను  ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.    ఉద‌యం  7.00 గంట‌ల నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు ప‌ల్స్ పోలియో బూతులు ప‌నిచేస్తాయ‌ని అన్నారు.  అదే రోజున  164 హైరిస్క్ ఏరియాల‌లో బూతులు ఏర్పాటు చేయ‌బ‌డుతాయిన అన్నారు.
ఇందుకు గాను  సిబ్బంది మొత్తం 11,566, బూత్ స‌భ్యులు 11,200   విధులు నిర్వ‌హిస్తారని అన్నారు.  

   ఇటుక బ‌ట్టిల ప్రాంతాలు,  బ‌స్తీలు,   తాత్కాలిక శిబిరాలు , మార్కె ట్లు, దేవాల‌యాలు,  పార్కులు, జూ పార్క్ లాంటి ర‌ద్దీ ప్రాంతాల్లో  91 మొబైల్ బృందాలను  ప్ర‌త్యేకంగా  బూతులు ఏర్పాటు  చేసి  5 సంవ‌త్స‌రాలు చిన్నారుల గుర్తించి టీకాలు వేయుట‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు. 
అలాగే బ‌స్టాండ్‌ల‌లో, రైల్యే స్టేష‌న్లు, మెట్రో స్టేష‌న్ల‌లో ట్రాన్సిట్ బూతులు ఏర్పాటు  11వ తేది అర్ధ‌రాత్రి నుండి 14వ తేది అర్ధ‌రాత్రి వ‌ర‌కు నిరంత‌రంగా ప‌నిచేస్తాయిని అన్నారు. 

ఈ బృహత్తర బృహత్తర కార్య‌క్ర‌మంలో  అంగ‌న్ వాడీ టీచ‌ర్లు,  విద్యాశాఖ‌, విద్యుత్‌,  స్వచ్చంద సంస్ధ‌లు  మెడిక‌ల్ విద్యార్దులు, ఆశా వ‌ర్క‌ర్లు, ప్ర‌భుత్వ శాఖ సిబ్బంది, మ‌హిళా మండ‌ళ్లు వాలంటీర్లు  పాల్గొనాల‌ని సూచించారు.
 
  ప‌ల్స్ పోలియో పై విస్తృతి స్ధాయిలో  ప్ర‌చారం  గావించి,  ప్ర‌జ‌ల్లో  అవ‌గాహ‌న క‌ల్పించాలని  తెలిపారు.  ఇందుకు గాను  ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా,  బూతుల వ‌ద్ద‌, బ్యాన‌ర్లు,  అలాగే రేల్వే స్టేష‌న్ల‌లో, బ‌స్టాండ్‌ల‌లో  విరివిగా   ప‌బ్లిసిటి చేయాల‌ని, అలాగే  విద్యార్ధుల‌తో  ప‌ల్స్ పోలియో  ముందు రోజుల్లో  ర్యాలీలు నిర్వ‌హించాల‌ని  ఆయ‌న పేర్కొన్నారు. 

ప‌ల్స్ పోలియో  కార్య‌క్ర‌మాల రోజుల్లో  విద్యుత్ అంత‌రాయం లేకుండా   తగిన చ‌ర్య‌తు తీసుకోవాల‌ని ఆ శాఖ అధికారుల‌కు సూచించారు.    రైల్యే స్టేష‌న్ల‌లో , బ‌స్టాండ్‌ల‌లో    బూతులు ఏర్పాటు  త‌గిన వ‌స‌తులు క‌ల్పించాల‌ని అన్నారు. 

 ప‌ల్స్ పోలియో  విజ‌య‌వంతానికి సంబంధిత శాఖ అధికారుల‌, స్వ‌చ్చంద సంస్ధ‌లు,  అంగ‌న్ వాడీ టీచ‌ర్లు,  ప్ర‌తి ఒక్క‌రు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి విజ‌య‌వంతం చేసేందుకు  కృషి చేయాల‌ని ఆయ‌న తెలిపారు. 

ఈ స‌మావేశంలో  జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అధికారి డా. J.వెంక‌టి,   జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి  డాక్టర్ శ్రీధర్,  ఐయంఎ అధ్య‌క్షులు ద్వారకనాథ్ రెడ్డి ఇండియ‌న్  రెడ్ క్రాస్  జిల్లా అధ్య‌క్షులు భీమ్ రెడ్డి, surveillance వైద్యాధికారి Dr మురారి,జిల్లా  మీడియా అధికారి జక్కుల రాములు,సిపిఓ  డాక్టర్. సురేందర్,     పి. డి. అశోక్ చక్రవర్తి,  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ   సంక్షేమ అధికారులు జి. ఆశన్న, కోటాజి,  ప్రవీణ్, ఇలియాస్ అహ్మద్,  జి.ఎం ఇండ్రస్ట్రీస్ పవణ్ కుమార్,  సికింద్రాబాద్ ఎస్‌హెచ్ ఓ  గ‌ణేష్‌, మిల‌ట‌రీ అధికారులు,  జిహెచ్‌యంసి అధికారులు, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్స్, వైద్యాధికారులు, వివిధ శాఖల  జిల్లా అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

వెల్ నెస్ సెంటర్ల రిపోర్టులు పరిశీలన

September 29, 2025
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ యందు ఆరోగ్య కేంద్రం నుండి నెలవారి హెల్త్ వెల్నెస్ సెంటర్ల రిపోర్ట్లను తీసుకోవడం జరిగిందని,ఆ రిపోర్ట్ లను పరిశీలించడంతో పాటు సరిచేసి అనునిత్యం  చేయవలసిన అసంఖ్యాక్రామిత వ్యాధులు,ఈ సంజీవని, గర్భిణీ స్త్రీల, పిల్లలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ బిల్లలను మింగించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించడమైనదని మండల వైద్యాధికారి డా" టి.నిఖిల్ రాజ్ తెలిపారు ఈకార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ పర్యవేక్షకులు రూహిదాస్, మేఘ, ఆరోగ్య కార్యకర్తలు,యం.యల్.హెచ్.పీలు,డి.ఈ.ఓ, ప్రయోగ శాల నిపుణులు పాల్గొన్నారు

Friday, September 26, 2025

నేరెడ్మెట్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో బ్రతుకమ్మ సంబరాలు

September 26, 2025
ఎడిటర్ కె నరేష్ కుమార్ 9848025451

మేడ్చల్ మల్కాజిగిరి,(ఆరోగ్యజ్యోతి); నేరెడ్ మెట్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో వైద్య ఆరోగ్యశాఖ మహిళలు బతుకమ్మ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి వేడుకలకు మేడ్చల్ జిల్లా మాజీ డిప్యూటీ డి.ఎం.అండ్. హెచ్.ఓ. శోభరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.బతుకమ్మ సంబరాలు పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్.సుష్మ,డాక్టర్.మాధురి,సి. హెచ్.ఓ.రాము, హెడ్ నర్స్ ట్రెస్సా ,పి.హెచ్.ఎన్. జానకమ్మ, హెల్త్ సూపర్వైజర్లు,నిర్మల, కేజియా, నర్సింగ్ ఆఫీసర్లు,రేణుక,కవిత, స్వాతి,ఏ.ఎన్.ఎం.లు మంగ, పవిత్ర, స్వప్న, ప్రేమలత,శ్రీదేవి,చంద్రకళ, నూకేశ్వరి,లక్మి , సుగుణ,ఫార్మాసిస్టు కవిత, ల్యాబ్ టెక్నిషియన్ అపర్ణ ,అకౌంటెంట్ ఎం.మేఘన,ఎన్ హెచ్.ఎం. ఉద్యోగులు హేమలత, సరిత, లక్ష్మీ, సపోర్టింగ్ స్టాప్ భూలక్ష్మి యు.పీ.హెచ్.సి.వినాయక నగర్ సిబ్బంది, ఆశావర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు..

"స్వస్త నారీ శశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం

September 26, 2025
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యందు అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని "స్వస్త నారీ శశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో "(ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం)భాగంగా ప్రత్యేక వైద్య శిబిరంలో డా" సంగీత గర్భకోశం నిపుణులు,డా" హుతేష్ దేవ్ జెనరల్ సర్జన్,డా" సంధ్యారాణి ఆప్తాల్మాజిస్ట్ గార్లు పాల్గొని రిమ్స్ ఆదిలాబాద్ వారు పాల్గొని ధనోర,భీంపూర్, అర్లి, అంతర్బంద్, గ్రామాల మహిళలకు 112చికిత్సలు, పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయండం జరిగిందని ఇందులో చెవి,ముక్కు,గొంతు-0,దంతాల-0 సమస్య ఉన్న వారు,గర్భిణీ స్త్రీలు -80 కిశోర్ బాలికలు-35,క్షయ వ్యాధి గ్రస్తులు-5, అసంక్రామిత వ్యాధిగ్రస్తులు -32, వయోవృద్ధులు -6, గర్భాశయ క్యాన్సర్ -21 అవగాహన కల్పించడం,అందరికి చెవి, ముక్కు, దంతాల, ఆరోగ్యశ్రీ , ట్రస్ట్కేర్,రక్తం, అవయవదానం గురించి, తినే ఆహారపదార్థాలలో నూనే,చక్కెర 10% తగ్గించడం,స్థన,నోటి, గర్భాశయ క్యాన్సర్స్, పోషకాహారం ప్రాధాన్యత, వయోవృద్ధులు పరీక్షలు,క్షయ,సికెలస్ సెల్ అనీమియా వ్యాధుల గూర్చి, యోగా ద్వారా ఆరోగ్య సాధన,ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించడతో పాటు,మన జిల్లా క్షయ నివారణ అధికారి డా "సుమలత గారి ఆదేశాలను అనుసరించి"లీముగూడ" గ్రామంలో క్షయ వ్యాధి నిర్థారణ కోసం ఇండ్లసందర్శణలు చేసి ప్రతీ ఇంటి వ్యక్తుల యొక్క తెమడ/ కళ్ళె పరీక్షల కోసం 41 ప్రజలవి సేకరించి పంపించడంతో పాటుక్షయ రోగి ఇండ్లను సందర్శించి మందులను వాడుచున్నార లేదా చూడడంతో పాటు పోషకాహారం తీసుకోవాల్సిందిగా కోరడమైనదని, శుక్రవారం ఫ్రైడే -డ్రైడే కార్యక్రమం మరియు ర్యాపిడ్ ఫీవర్ సర్వేలో "థీమోఫాస్" ఆంటిలార్వల్ మందును పిచికారి చేయడం జరిగిందని మండల వైద్యాధికారి డా "నిఖిల్ రాజ్,మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్ తెలిపారు ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి డా" టి, నిఖిల్ రాజ్,ఆర్.బి.యస్.కె డా"నరేంధర్, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారి లింగంపల్లి జ్ఞానేశ్వర్, పర్యవేక్షకులు రోహిదాస్,మేఘ, ప్రియాంక నర్సింగ్ ఆఫీసర్,యం.యల్.హెచ్.పీలు సంధ్యారాణి, మాయావతి,సాహితి, ఆరోగ్య కార్యకర్తలు లచ్చుబాయ్,సరస్వతి, సుజాత, భాగ్యవతి,జానాబాయ్, విజయలక్ష్మి, విష్ణుకుమార్,ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఆశా కార్యకర్తలు భారతి, శకుంతల,పద్మ, మీర,స్వప్న, రేఖ,రోజ,శకుంతల, సంతోషిణి,శంకర్, రేఖ, రాందాస్ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఐవి గురించి చర్చిద్దాం - హెచ్ఐవి ని నివారిద్దాం

September 26, 2025
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పల్నాడు (ఆరోగ్యజ్యోతి)హెచ్ఐవి గురించి చర్చిద్దాం హెచ్ఐవి ని వారిద్దాం అని మన భావి తరాలు హెచ్ఐవి బారిన పడకుండా రక్షించుకోవాలంటే, మరొకసారి హెచ్ఐవి గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవటానికి మరియు చర్చించటానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు శుక్రవారం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో స్వస్థనారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో నరసరావుపేట లోని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వాహనం ప్రొజెక్టర్ ద్వారా హెచ్ఐవి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాప్తి చెందే పద్ధతి, హెచ్ఐవి వ్యాప్తి నివారణ చర్యలు వివరించారు. హెచ్ఐవి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రచురించిన కరపత్రములు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భూలక్ష్మి ఆరోగ్య కార్యకర్త అనుపమ టిబి సూపర్వైజర్ సౌజన్య, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఎల్ నాగలక్ష్మి, కె ఈశ్వర్, ఎం జ్యోతి, అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Bottom Ad Space

Veda Software Ad