రిమ్స్ నర్సింగ్ కళాశాలకి.. అసిస్టెంట్ ప్రొఫెసర్లు..
అదిలాబాద్ రిమ్స్, (ఆరోగ్య జ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి అనుబంధంగా ఉన్న నర్సింగ్ కాలేజ్ కి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చారు. బుధవారం రోజు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇన్చార్జ్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జై సింగ్, డైరెక్టర్ ఛాంబర్ లో జైన్ అయ్యారు. బన్సువాడ నర్సింగ్ కళాశాలలో ట్యూటర్లుగా ఉన్న ఆర్. శ్రీదేవి, పి.లక్ష్మి లకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి లభించింది. దీంతో బుధవారం రోజు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇంచార్జ్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ కి జైనింగ్ కాపీ ఇచ్చారు. డైరెక్టర్ డాక్టర్ జై సింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొంది అదిలాబాద్ నర్సింగ్ కళాశాలకు వచ్చినందుకు గాను పి లక్ష్మి, ఆర్ శ్రీదేవి లను ఘనంగా సన్మానించారు.