ప్రజల జీవితాలలో వెలుగు నింపడమే మా బాధ్యత
గిద్దలూరు ప్రజల జీవితాలలో వెలుగులు నింపడమే నా బాధ్యత.
- మదిరె రంగ సాయి రెడ్డి, ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు
గిద్దలూరు రూరల్:ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిధిలోని కొంగలవీడు గ్రామంలో దీపావళి పండుగ సందర్బంగా తన సొంత నిధులతో ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి గ్రామం మొత్తం వీధి లైట్లు ఏర్పాటు చేశారు.
ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలనే మంచి మనస్సుతో ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొంగలవీడు గ్రామ సర్పంచ్ లక్ష్మి ప్రసన్న గారు మరియు గ్రామ ప్రజలు కొనియాడారు.