అమ్మ పాలె అమృతం
తంగడపల్లి, (ఆరోగ్య జ్యోతి): అమ్మ పాలు ఒక అమృతంలా ఉంటాయని పిల్లలందరికీ తల్లిపాలు తాగించడం వల్ల ఆరోగ్యం గా ఉంటారని ఐసిడిఎస్ సూపర్వైజర్ సూర్య కళ అన్నారు. తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పంతంగి గ్రామంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశువు పుట్టిన వెంటనే ముర్రపాలు ను తాగించాలని అది శిశువు జన్మకు శ్రీరామరక్షగా పనిచేస్తుందన్నారు ముర్రపాలలో శరీరానికి అవసరమయ్యే అన్ని విటమిన్స్ మినరల్స్ క్యాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయని తెలిపారు. చాలామందికి ఈ విషయం తెలవక ముర్రపాలను పిండి పారపోస్తారని అది చేయడం తప్పు అన్నారు. ముర్రపాల వల్లనే శిశు శరీరం గట్టిదనం ఏర్పడి రోగనిరోధక శక్తి పెంచుతుందని తెలిపారు. చాలామంది తల్లిపాలు ఇవ్వకుండా డబ్బా పాలు తాపుతారని దీని ద్వారా శిశువు అనారోగ్యాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ శిశువుకు తల్లిపాలు తాగించాలని ఆమె సూచించారు. తల్లిపాలల్లో శిశువుకు అవసరమయ్యే అన్ని రకాల పోషకాహాలు ఉంటాయని పేర్కొన్నారు తల్లిపాల వారోత్సవ సందర్భంగా తల్లిపాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఎంఎల్హెచ్పి జ్యోతి ఇందిరా ఎంపీహెచ్ఏ వి గంగాధర్ ఎస్ తిరుమల్ లలిత రమ తో పాటు తదితరులు పాల్గొన్నారు.